Friday, April 19, 2024
Friday, April 19, 2024

వచ్చి కళ్లారా చూసి ఏపీ అభివృద్ధి గురించి తెలుసుకో కేటీఆర్‌… : మంత్రి జోగి రమేశ్‌

ఏపీలో కరెంట్‌ లేదు, నీళ్లు లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేశ్‌ మండిపడ్డారు.ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్‌ ఏపీలో కరెంట్‌ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని తన మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన జోగి రమేశ్‌.. ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌ కు సవాల్‌ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్‌ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ లాగానే కేటీఆర్‌ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని విమర్శించారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నానంటూ చెప్పారు. వాలంటీర్లతో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఏపీలో తాగు, సాగు నీటి సమస్య లేనే లేదన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img