జనసేన పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ మాత్రమే పోటీ చేస్తారని ఇంకెవరూ పోటీ చేయరని స్పష్టం చేశారు. తాను పూర్తిగా పార్టీ సేవకే అంకితమవుతానన్నారు. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తాను పోటీ చేయని విషయాన్ని ప్రకటించారు.