వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లను సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. కష్టపడితే ఇదేమంత అసాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జులతో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మన లక్ష్యమని, ఇది కష్టంకాదని చెప్పారు. కుప్పంలో మున్సిపాల్టీ గెలుస్తామని అనుకున్నమా? ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నమా? అని జగన్ అన్నారు. ఇది కూడా సాధ్యమేనని సీఎం ఉద్ఘాటించారు.