వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ (భీమవరం) ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నట్టు పరిషత్ పాలకమండలి చైర్మన్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదఅమిరంలోని వెస్ట్బెర్రీ హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ముందుగా జనవరి 3న భీమవరంలో తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. జనవరి 6న ప్రాచీన కవులు, రాజవంశీయుల కుటుంబీకులకు ఆంధ్ర వాయ పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జనవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగింపు సభ, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చ్చే వారికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదని తెలిపారు.