టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వరద ప్రాంతాల్లో బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తిరిగి అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పటం పైన ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గం కుప్పంకు ఏమీ చేయని చంద్రబాబు.. కనీసం రెవిన్యూ డివిజన్ గా కూడా మార్చుకోలేకపోయారన్నారు. ఇప్పుడు ముంపు మండలాలను జిల్లాగా మారుస్తామని చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా.. అప్పులు చేసి ఎంజాయ్ చేసారంటూ ఆరోపించారు. పోలవరం కట్టకుండా జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకుని, చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారన్నారని మండిపడ్డారు.ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పేదవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు.