ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటపొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలకొరిందని, ఒక్క వడ్లగింజ కూడా చేతికొచ్చే పరిస్థితిలేదన్నారు. దాదాపు ఎకరాకు రూ. 30 వేలు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రభుత్వం మాటలు చెప్పకుండా వెంటనే నివేదికలు తెప్పించుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు.