Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వారడిగితే పడవ ప్రమాదంపై విచారణ : మంత్రి తానేటి వనిత

టీడీపీ అధినేత చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా నిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గోదావరి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు పడవ బోల్తా కొట్టడంతో టీడీపీ నేతలు గోదావరి నది నీళ్లల్లో పడిపోయారు. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీపంలోనే జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే అప్పటికే చంద్రబాబు మరొక బోటులోకి మారడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటన పై టీడీపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి చంద్రబాబు జారి పడడమే తరువాయి అంటూ చేసిన ట్వీట్‌ను టార్గెట్‌ చేస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు కనీస భద్రత కల్పించలేదని మండిపడుతున్నారు. ఈ ప్రమాదం వెనుక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. పడవ ప్రమాద ఘటనను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని ఆమె సీరియస్‌ అయ్యారు. పడవ ప్రమాద ఘటనలో ఎటువంటి కుట్ర లేదని వెల్లడిరచారు. తెలుగుదేశం పార్టీ నేతలు అడిగితే ఈ ఘటనపై విచారణ జరిపించటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో గోదావరినదిలో 25 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్న సమయంలోనే ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చంద్రబాబు పడవ బోల్తా ఘటన జరిగిందంటూ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు పడవలపై వెళ్లారు అంటూ వ్యాఖ్యానించారు. పడవ ప్రమాద ఘటనలో ఎటువంటి కుట్ర లేదని పేర్కొన్న ఆమె గోదావరిలో మునిగి పోయిన టీడీపీ నేతలను కాపాడిరది మా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అంటూ పేర్కొన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు వరదల పేరుతో బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. తాము వరద సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేశామని, వరద బాధితులను ఆదుకోవడానికి అధికారులు శతవిధాలా ప్రయత్నం చేశారని తానేటి వనిత తెలిపారు. టీడీపీ అంతర్గత తప్పిదాలను కప్పిపుచ్చడం కోసం కావాలని వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img