Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వారిని భయపెడుతోంది, ఆలోచించండి.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్‌

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ మధ్య సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అంతేకాదు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు.. అలాగే రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని.. సెంటిమెంట్‌లను ఉపయోగించుకోవడం అభివృద్ధిని తీసుకురాదన్నారు. ‘పెట్టుబడులను ఆకర్షించే మరియు ఉపాధిని కల్పించే అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు. సుపరిపాలన, బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాలు, చట్టాల అమలు దీనికి కీలకం, కార్యాలయాలు, భవనాలు కాదు. సెంటిమెంట్‌లను ఉపయోగించుకోవడం అభివృద్ధిని తీసుకురాదు, పెట్టుబడులు పెట్టేవారిని భయపెడుతుంది. ఆలోచించండి’ అంటూ లక్ష్మీనారాయణ ట్వీట్‌ చేశారు. నిజం చెప్పారంటూ కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యం కాదంటూ కొంతమంది కామెంట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img