Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వాళ్లొస్తే.. సంక్షేమ ప‌థ‌కాలు ఎత్తివేతే.. జ‌గ‌న్

చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు అధికారంలోకి వ‌స్తే తాను అమ‌లు చేస్తున్న అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎత్తివేస్తార‌ని, వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటు వేయొద్ద‌ని వైసీపీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలిలో చుక్క‌ల భూముల హ‌క్కుప‌త్రాల‌ను ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేసిన అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ ఇప్పుడు సడెన్‌గా రైతు బాంధవులయ్యారని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సూటుబూటు వేసుకుని రైతు సంక్షేమపథకాలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులను కోలుకోని దెబ్బ కొట్టారని.. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఇప్పుడు ఆయనతోపాటు పవన్ పొలిటికల్ బాంధవుల అవతారం ఎత్తారని విమర్శించారు. తనకు ఓటు వెయ్యకపోయినా ఫర్వాలేదు.. సంక్షేమమే ముఖ్యమనే లక్ష్యంతో పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు . పంటనష్టాల పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు, పవన్‌ను ఎద్దేవ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్‌ 22(1)ఏ నుంచి డీనోటిఫై చేశామన్నారు. దీంతో భూములపై రైతులకు సర్వహక్కులు లభించాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img