వైజాగ్ ఎయిర్ పోర్ట్లో ఘనస్వాగతం
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు రాక నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వైజాగ్ విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. నినాదాలతో హోరెత్తించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విమానాశ్రయం వెలుపల భారీ రద్దీ ఏర్పడిరది.