గత వారం తుదిశ్వాస విడిచిన దివంగత సూపర్ స్టార్ కృష్ణ అస్తికలను కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన అస్తికల్ని కృష్ణానదితో పాటు మిగతా నదుల్లోనూ నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఇవాళ కృష్ణానదిలో ఆయన అస్తికలు నిమజ్జనం చేయనున్నారు. విజయవాడ వద్ద కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్తికల్ని కుటుంబ సభ్యులు నిమజ్జనం చేస్తున్నారు. దీనికోసం కృష్ణ తనయుడు మహేష్ బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ ఉదయం విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కృష్ణ కుటుంబసభ్యులు.. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణానది ఘాట్కు వెళ్లి అక్కడ అస్తికలు నిమజ్జనం చేయబోతున్నారు. ఇందుకోసం స్దానికంగా కొందరి సాయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.