విజయనగరం జిల్లా కురుపాంలోని గురుకుల హాస్టల్లో విద్యార్థులకు పాముకాటు ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మృతిచెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి ఆ పరిహారాన్ని అందజేయనున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతోనే వైద్యం చేయిస్తామన్నారు. విద్యార్థికి పాముకాటు ఘటనపై సీఎంకు మంత్రులు పుష్ప శ్రీవాణి, వేణుగోపాల్ వివరించారు.