అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగి పడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలు పంట కోత పనుల్లో ఉండగా, వారిపై విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడ్డాయి. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో ఈ ఘటన జరిగింది. వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగిందని దర్గాహొన్నూరు మాజీ సర్పంచ్ ముక్కన్న వెల్లడిరచారు. ఘటన స్థలం మృతుల రోదనలతో శోకసంద్రంలా మారింది.