Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగింది : ఉండవల్లి

విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ విమర్శించారు. చర్చ లేకుండానే విభజన బిల్లును ఆమోదించారని, రాజధాని లేకుండానే ఒక రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఎందుకు చర్చించడం లేదని ఆయన ప్రశ్నించారు. చర్చ లేకుండా బిల్లు ఎలా ఆమోదిస్తారన్నారు. రాజధాని లేకుండా విభజన ఎలా చేస్తారని నిలదీశారు.రాష్ట్ర సమస్యలపై వైస్సార్సీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పోరాడాలని హితవు పలికారు. ఏపీ అంటే కేంద్రానికి అంత అలుసా? అని మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. రోబోయే రోజుల్లో ఏపీని అసలు పట్టించుకోరని అన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏపీలో కరెంట్‌ కోతలపై ఉండవల్లి స్పందిస్తూ ఫిబ్రవరిలోనే విద్యుత్‌ కోతలు ఉంటే వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img