Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విశాఖను ధ్వంసం చేస్తున్నది వైసీపీ మంత్రులే.. : రామకృష్ణ

అమరావతి రైతులు చేపడుతున్న మహాపాదయాత్రపై వైసీపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా ఇటువంటి కామెంట్లే చేశారు. ఈ వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విశాఖను ధ్వంసం చేస్తున్నది వైసీపీ మంత్రులేనని ఆయన అన్నారు. విశాఖ ఒక్క రాత్రిలో అభివృద్ధి చెందలేదని… పోర్టు, ఉక్కు కర్మాగారం వంటివి వచ్చిన తర్వాతే విశాఖ ప్రగతిపథంలో పయనించిందని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటుపరం చేస్తుంటే వైసీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రైతుల పాదయాత్రపై మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని… ప్రజల మధ్య విద్వేషాలను పెంచే ప్రయత్నం చేయవద్దని అన్నారు. హైకోర్టు విచారణతో అమరావతి రాజధాని అంశం ముగిసిందని అందరూ భావించామని.. మూడు రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నామని హైకోర్టులో వైసీపీ ప్రభుత్వం అఫిడవిట్‌ వేసిందని… అయితే, ఇప్పుడు మళ్లీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img