విశాఖ నగరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా విశాఖ ఏయూలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని నాలుగు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.10 వేల కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. రూ.7,614 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పాతపట్నం – నరసన్నపేట మధ్య రెండు లైన్ల రహదారి, తూర్పు తీరంలో ఓఎన్జీసీ యూ ఫీల్డ్ అభివృద్ధి, గుంతకల్లులో ఐవోసీఎల్ చేపడుతున్న గ్రాస్ రూట్ డిపోలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు. విద్యుదీకరణ, డబ్లింగ్ రైల్వే లైన్ను ప్రధాని ప్రారంభించారు.