Friday, April 19, 2024
Friday, April 19, 2024

విశాఖలో గ్లోబల్ సమ్మిట్‌ కాదు.. లోకల్‌ ఫేక్‌ సమ్మిట్ : నారా లోకేష్‌

విశాఖలో జరిగింది గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు.. లోకల్‌ ఫేక్‌ సమ్మిట్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. సోమవారం పీలేరులో మీడియాతో మాట్లాడుతూ.. ఏబీసీ కంపెనీ టర్నోవర్‌ రూ.120 కోట్లు అని.. అలా కంపెనీ లక్షా 20 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందన్నారు. లక్ష కేపిటల్‌ ఉన్న ఓ కంపెనీ 76 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందా అని ప్ర‌శ్నించారు. పీపీఏలు రద్దు చేయొద్దని కేంద్రం హెచ్చరించినా జగన్‌ పట్టించుకోలేదన్నారు. ఏపీలో ఉద్యోగాలు నిల్‌.. గంజాయి ఫుల్‌ అని, దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలం ఏపీలోనే ఉందన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు జగన్‌ పాలనలో బైబై చెప్పాయని వివ‌రించారు. ఏపీలో ఉన్న కంపెనీలు విస్తరణ చేపట్టడం లేదని.. అమర్‌రాజాతో పాటు ప్రముఖ కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు. రాష్ట్రంలో యువత 20 వేల ఉద్యోగాలు కోల్పోయిందని లోకేష్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img