మంత్రి అమర్ నాథ్
మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన ఉంటుందని అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతాం అని తెలిపారు. విశాఖ రావడానికి అందరికీ ఆసక్తి ఉందని వ్యాఖ్యానించారు. ఒకవైపు అమరావతే రాజధాని అని విపక్షాలు చెప్పుకొస్తున్న ఈ తరుణంలో మంత్రి అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.