కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఎంపీలు మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి శుక్రవారం దిల్లీలో కలిశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యాన్ని వారు వైష్ణవ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు.