పింఛ డ్యామ్ తెగిపోగానే కలెక్టర్, అధికారులు స్పందించి ఉంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది కాదని పీసీసీ శైలజానాథ్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజల కష్టాలు పట్టవా అని మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీశారు. నందలూరులో చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు.