కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు మృత్యువాత పడిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరిలో ఐదుగురు వేద విద్యార్థులు కాగా మరోకరు వారి గురువు. కాగా వేద విద్యార్థుల మృతి బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న వేద విద్యార్థులు చనిపోవడం కలచివేసిందన్నారు. నదీ సమీపంలో వేద పాఠశాల ఉన్నందున విద్యార్థుల భద్రత పట్ల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.