అయ్యన్న కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్
నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కుటుంబసభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయ్యన్నను ఎదుర్కోలేక సీఎం జగన్ పోలీసులను పంపిస్తున్నారని అన్నారు. ఇక్కడ పోలీసుల మోహరింపు, నిర్బంధం చూస్తుంటే నర్సీపట్నంలో ఉన్నామా?.. ఉక్రెయిన్లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. టీడీపీ నేతలపై ఇప్పటి వరకు 3,250 కేసులు పెట్టారన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.