Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైఎస్ వివేకా హత్య కేసులో వంటమనిషి తనయుడిని విచారించిన సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగళవారం పీఏ కృష్ణారెడ్డిని విచారించిన దర్యాఫ్తు సంస్థ సీబీఐ బుధవారం వంటమనిషి కుమారుడిని విచారించింది. హైదరాబాద్ కోఠిలోని కార్యాలయంలో వంటమనిషి లక్ష్మీదేవి తనయుడు ప్రకాశ్ ను ప్రశ్నించింది దర్యాఫ్తు సంస్థ. వివేకా హత్య తర్వాత లేఖ దాచి పెట్టడంపై ప్రకాశ్ నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు సీబీఐ అధికారులు. లేఖను కృష్ణారెడ్డి ద్వారా ప్రకాశ్ దాచిపెట్టాడనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లేఖ దాచిపెట్టడంపై వీరిద్దరి నుండి సీబీఐ సమాచారం రాబట్టే దిశగా ప్రశ్నిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img