Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా

ఈనెల 31కి కేసును వాయిదా వేసిన సీబీఐ కోర్టు
కోర్టుకు హాజరైన నిందితులు
చంచల్ గూడ జైలుకు నిందితులు

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు జ్యూడిషియల్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డితో పాటూ గంగిరెడ్డి, దస్తగిరి హాజరయ్యారు. భారీ బందోబస్తు నడుమ వీరిని కోర్టుకు తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం విచారణ ఈ నెలాఖరుకు వాయిదా పడింది. విచారణ అనంతరం… జ్యుడీషియల్ ఖైదీలను చంచల్ గూడా జైలుకు తరలించారు.2019లో వివేకా హత్య సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కేసు విచారణను ఇటీవలే తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img