Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు

వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరులోని నివాసంతో పాటు..ఢల్లీి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. కాగా ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢల్లీి నుంచి వెళ్లిన ఈడీ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 40కి పైగా లొకేషన్లలో రెయిడ్స్‌ కొనసాగుతున్నాయి. హైదరాబాదులో 20 చోట్ల సోదాలు జరుగుతుండగా%ౌౌ% ఏపీలోని నెల్లూరులో కూడా రెయిడ్స్‌ జరుగుతున్నాయి. ఈ స్కామ్‌ లో మాగుంటపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఢల్లీిలోని వైన్‌ షాపుల్లో కొన్నింటిని మాగుంటకు చెందిన లిక్కర్‌ కంపెనీలు చేజిక్కించుకున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాగుంట నివాసాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. మరోవైపు మాగుంటతో పాటు మరికొందరు నేతల హస్తం కూడా ఈ స్కాంలో ఉందని ఈడీ ఆరోపిస్తోంది. త్వరలోనే వీరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img