Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి : వర్ల

శాననసభలో వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నారా దంపతులకు వర్ల దంపతుల మద్దతు అనే నినాదంతో దీక్ష చేపట్టామని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండు చేస్తూ విజయవాడలోని స్వగృహంలో వర్ల రామయ్య దంపతులు ఈ ఉదయం నిరసన దీక్ష చేపట్టారు. 12 గంటలపాటు రాత్రి 8.30 వరకు దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాసనసభలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చట్టసభల్లో వ్యక్తిగత దూషణలు ఏమిటని వర్ల ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి గద్దె దిగే రోజులు తొందరగానే ఉన్నాయని అన్నారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్‌ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్‌ విఫలమయ్యారని విమర్శించారు.పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు. జూనియర్‌ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img