రోజురోజుకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కూల్చడం తప్ప కట్టడం చేతగాని సీఎం జగన్ వైఖరితో రాష్ట్రంలో శిథిలాలే మిగులుతున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మాణంలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్కులో కూల్చివేతలు దారుణం. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతుంటే ఉపముఖ్యమంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ట్వీట్ చేశారు.