Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైసీపీ నేత హత్యతో కలకలం.. సింగరాయకొండలో ఉద్రిక్తత

పాత కక్షల నేపథ్యంలో వైసీపీ నేత పసుపులేటి రవితేజను బుధవారం రాత్రి లారీతో ఢీకొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులు హత్యకు ఉపయోగించిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని సింగరాయకొండ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. దీంతో హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న వ్యక్తుల్లో కొందరు పోలీసుస్టేషన్‌ గోడ దూకి వెళ్లి లారీకి నిప్పంటించారు. వెంటనే గమనించిన పోలీసులు మంటలను అదుపు చేశారు. అంతటితో ఆగకుండా ఆందోళనకారులు పోలీసు స్టేషన్‌ ఎదుట ఉన్న చలివేంద్రాన్ని తగులబెట్టారు.సింగరాయకొండలో షాపుల్ని మూసివేయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఒంగోలు నుంచి వచ్చిన పోలీసు బలగాలను మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండి పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఒంగోలు డీఎస్పీ, సీఐ, ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.బుధవారం రాత్రి మాజీ సర్పంచ్‌ పసుపులేటి శ్రీనివాసులు కుమారుడు, వైఎస్సార్‌సీపీ నేత రవితేజ స్నేహితుడితో కలిసి వెళుతుండగా.. కనుమళ్ల దగ్గర నేషనల్‌ హైవేపై లారీతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు. అతడితో పాటూ ఉన్న స్నేహితుడు లారీని ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో లారీ నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో రవితేజ అక్కడికక్కడే చనిపోయాడు. పాతకక్షలతోనే ఈ హత్య జరిగినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. హత్యకు ఉపయోగించిన లారీ స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడిదని అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img