Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైసీపీ ప్రభుత్వం దిల్లీలో యాచిస్తోంది : చంద్రబాబు

రెండున్నరేళ్లలో మూడు టాయిలెట్లు కట్టలేని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. 3 రాజధానులు కడతారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు సమక్షంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ శేక్షావలి, నూర్‌ భాషా వర్గ నేతలు టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాటాడుతూ, మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రపతిగా కలాంను చేసిన సందర్భం ఎక్కువ తృప్తి నిచ్చిందని స్పష్టం చేశారు. ఐటీకి ఇచ్చిన ప్రోత్సహం వల్లే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉన్నాడని తెలిపారు. అమరావతి గ్రాఫిక్స్‌ అంటున్న వైసీపీ నేతలు… హైదరాబాద్‌లో తాను ఏమి చేసానో చూడాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దిల్లీలో యాచిస్తోందని, ఆర్థిక కష్టా నుంచి కాపాడాలని వైసీపీ నేతలు కేంద్రాన్ని వేడుకుంటున్నారని వెల్లడిరచారు. ు. రెండు కళ్లుగా ఉన్న అమరావతి, పోలవరాన్ని పొడిచేసి ఏపీని గుడ్డిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో ఏపీని ఇంత భ్రష్టు పట్టించిన సీఎం ఎక్కడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img