Friday, April 19, 2024
Friday, April 19, 2024

వైసీపీ ప్రభుత్వం సర్పంచ్‌లను ఉత్సవమూర్తులుగా మార్చేసింది

చంద్రబాబునాయుడు
సర్పంచ్‌లకు అధికారం లేకుండా చేశారని, హక్కుల కోసం వారు చేసే పోరాటానికి టీడీపీ మద్దతిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సర్పంచ్‌ల అవగాహన సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ..సర్పంచ్‌లకు రాజ్యాంగం హక్కులు కల్పించిందన్నారు. సర్పంచ్‌ అధికారాలను తీసుకోవడానికి జగన్‌ ఎవరని ప్రశ్నించారు. గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం సర్పంచ్‌లను ఉత్సవమూర్తులుగా మార్చేసిందని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా అరాచకాలు జరిగాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయోద్దని వైసీపీ హుకం జారీ చేసిందని, ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనివ్వలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img