Friday, April 19, 2024
Friday, April 19, 2024

వ్యవసాయ మంత్రిగా కాకాణి బాధ్యతలు..

వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఈ వెంటనే 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్‌ అవకాశం కల్పించే ఫైల్‌పై తొలి సంతకం చేశారు. దీని కోసం రూ.1,395 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, 3,500 ట్రాక్టర్లని వైఎస్సార్‌ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైల్‌పై కాకాణి రెండో సంతకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గన్నవరంలో రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img