వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి ప్రతిపాదనను సీఎం జగన్ తిరస్కరించారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రతిపాదనను సీఎం జగన్ అంగీకరించలేదన్నారు. మళ్లీ ఐదేళ్లకు పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి చెబుతామన్నారు.