నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ ఎల్లుండి తలపెట్టబోయే శ్రమదానాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కాటన్ బ్యారేజ్పై శ్రమదానం చేసి తీరుతామన్నారు. ఇప్పుడు హడావుడిగా పవన్ వెళ్లే ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నారని చెప్పారు.ప్రజా సమస్యలపై స్పందించమంటే…వ్యక్తిగత దూషణలు ఎందుకు? అని ప్రశ్నించారు. ‘‘మంచి పని చేస్తున్నాం, ఎందుకు అడ్డుకుంటారు? ప్రభుత్యం రోడ్ల మరమ్మతులు చేయట్లేదు కాబట్టే మేము ముందుకొచ్చాము.’’ అని ఆయన అన్నారు.