Friday, April 19, 2024
Friday, April 19, 2024

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

ఎగువన భారీ వర్షీలు కురుస్తుండటంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3,56,442 క్యూసెక్కుల వరద వస్తున్నది. అధికారులు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేత 3.78 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 4,40,991 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉన్నది. నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ఇప్పుడు 214.3637 టీఎంసీలు ఉన్నాయి. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img