శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద కొనసాగుతోంది. జలాశయం జలకళను సంతరించుకున్నది. 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లక్షా 49 వేల 568 క్యూసెక్కులు ఉండగా 2 లక్షల 2వేల 811 క్యూసెక్కుల నీటికి నాగార్జున సాగర్కు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులకు చేరుకున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 214.8450 టీఎంసీలకు చేరుకున్నది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.