శ్రీశైలం మల్లన్నను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.గురువారం ఉదయం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకున్నారు. సున్నిపెంట న నుంచి కేంద్ర హోం మంత్రి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. హోం మంత్రి అమిత్షాకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆలయ అర్చకస్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్న దర్శనం అనంతరం దేవస్థానం అతిథి గృహంలో మధ్యాహ్నం భోజనం చేశారు.అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి దిల్లీకి పయనమవుతారు.అమిత్ షా పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.