Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సంక్రాంతికి..మరికొన్ని స్పెషల్‌ రైళ్లు..

సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నా చాలామందికి నిరాశ ఎదురువుతోంది. ఇప్పటికే ప్రత్యేకంగా బస్సులు, రైళ్లను ప్రకటించగా.. అన్నీ ఫుల్‌ అయ్యాయి. అయితే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రద్దీ మరింత పెరగడంతో మరికొన్ని స్పెషల్‌ రైళ్లు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రైల్వేశాఖ డిమాండ్‌ ఎక్కువగా ఉండే మార్గాల్లో మరిన్ని రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 12న రైలు నంబర్‌ (07571) సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌.. జనవరి 13, 14న ట్రెయిన్‌ నంబర్‌ (07573/07574) కాకినాడ టౌన్‌-తిరుపతి మధ్య రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ రైళ్లలో రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. సంక్రాంతి రద్దీతో రైల్వేశాఖ ఇప్పటికే స్పెషల్‌ రైళ్లు నడుపుతోంది. సీట్లన్నీ హాట్‌ కేకుల్లా ముందుగానే రిజర్వ్‌ అయ్యాయి. ఇంకా డిమాండ్‌ పెరగడంతో రైల్వేశాఖ వీలైనన్ని రైళ్లను నడుపుతోంది. ఈ నెలాఖరు వరకు కొన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్‌, విజయవాడ, తిరుపతితో పాటూ డిమాండ్‌, రద్దీ ఉన్న రూట్ల మీదుగా రైళ్లు నడుస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img