సంక్రాంతి పండుక్కి రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్ను నడిపిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడిరచింది. పండుగ రద్దీ నేపథ్యంలో జనవరి 1 నుంచి జనవరి 20 వరకు 208 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచింది. ప్రయాణీకుల రద్దీ, సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తం 208 ప్రత్యేక రైళ్లను`హైదరాబాద్ ప్రాంతం నుంచి ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పండుగ సీజన్లో కాన్కోర్స్ లేదా వేచి ఉండే ప్రదేశాలను, రద్దీగా ఉండే ప్లాట్ఫారమ్లను నివారించాలని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ అధికారులు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. రైలు ప్రయాణికులందరికీ సేవలందించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జనసాధరన్ (రెండవ సీటింగ్ వసతి), సువిధ (ప్రత్యేక ఛార్జీలు) సర్వీసులు హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాలకు నడిచే విధంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాకేష్ తెలిపారు. 208 రైళ్లలో వాటిలో 50% లేదా 100 కంటే ఎక్కువ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మొదలైన ప్రధాన స్టేషన్లను కవర్ చేస్తూ దాదాపు 30 ప్రత్యేక రైళ్లు ఇతర జోన్ల నుంచి బయలుదేరి దక్షిణ మధ్య జోన్ను రవాణా కొనసాగిస్తున్నాయన్నారు. నిత్యం రైళ్ల వెయిటింగ్ జాబితాలను పర్యవేక్షిస్తూ.. డిమాండ్ను బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లను కేటాయిస్తామని తెలిపారు.