Friday, April 19, 2024
Friday, April 19, 2024

సభలు, సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహాలు, ధార్మిక సభలు, సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యకు పరిధి నిర్దేశిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. సమూహ కార్యక్రమాలో గరిష్టస్థాయిలో 150 మందికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టంచేసింది. ఆయా కార్యక్రమాల్లో భౌతిక దూరం ఉండేలా సీట్ల మధ్య ఖాళీ వదలాలని, మాస్కులు ధరించటం, శానిటైజేషన్‌ లాంటి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. నిబంధనల ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణా చట్టం కింద, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్టు స్పష్టంచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img