Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సమస్యల సుడిగుండం లాగా ఆంధ్రప్రదేశ్‌ : లోకేష్‌

సమస్యల సుడిగుండం లాగా ఆంధ్రప్రదేశ్‌ ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. కోవిడ్‌ కారణంగా చనిపోయిన కార్యకర్తల, స్థానికుల ఇళ్లకు వెళ్లి లోకేష్‌ పరామర్శించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ, శాసనసభలో మా తల్లిపై చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకే మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎటు చూసినా సమస్యలే. ఒక సమస్య కోసం పోరాడితే ఇంకో సమస్య తీసుకువస్తుందని అన్నారు. అమ్మఒడి, పెన్షన్లు అందరికీ అందడం లేదు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. శాసన మండలి రద్దు, ఉపసంహరణపై రోజుకో మాట చెప్పడం సీఎంకు అలవాటుగా మారింది. అందుకే జగన్‌ను ప్రజలు తుగ్లక్‌ సీఎం అంటున్నారని అన్నారు. ఎక్కడో సౌత్‌ ఆఫ్రికాలో 3 రాజధానులు చేశారని.. ఏపీలో ఇక్కడ జగన్‌ చేయడం తుగ్లక్‌ పాలనకు నిదర్శనమని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img