Friday, April 26, 2024
Friday, April 26, 2024

సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షలు ఆర్థికసాయం

అమరావతి: తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన జవాన్‌ సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం జగన్‌ రూ.50 లక్షలు ఆర్థికసాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా సీఎంవో కార్యాలయం ప్రకటించింది. మరోవైపు సాయితేజ భౌతికకాయాన్ని దిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో ఆర్మీ అధికారులు తరలిస్తున్నారు. కోయంబత్తూరు మీదుగా బెంగళూరుకు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ఎగువ రేగడ పల్లి గ్రామానికి సాయి తేజ భౌతికకాయాన్ని తరలించనున్నారు. అధికార సైనిక లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్వగ్రామానికి సాయి తేజ భౌతికకాయం చేరే అవకాశం ఉంది. అయితే బెంగళూరులోని సైనిక ఆస్పత్రిలోనే రాత్రికి ఉంచి రేపు ఉదయం తమకు అప్పగించాలని సాయి తేజ కుటుంబ సభ్యులతో సహా తమ్ముడు మహేష్‌ బాబు ఆర్మీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img