కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణాలంటున్నారని విమర్శించారు.కల్తీ బ్రాండ్లపై ప్రధాని, ఆరోగ్యశాఖమంత్రికి గతంలో లేఖ రాశానన్నారు. దీని వెనుక ఎవరున్నారో అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. కల్తీ మద్యంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండు చేశారు. సారా మరణాలపై దృష్టిమళ్లించేందుకే పెగాసస్ను తెరపైకి తెచ్చారని అన్నారు.