Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సీఎంను కలిసిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ

ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ రజనీకి పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్య పతక పోరు వరకూ భారత మహిళల జట్టు దూసుకెళ్లడంలో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీ క్రీడాస్ఫూర్తిని ప్రశంసించిన ముఖ్యమంత్రి, ఆమెను శాలువాతో సత్కరించిన జ్ఞాపికను బహూకరించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img