మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
రాజధానిపై మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ్నుంచి పనిచేస్తే.. అదే రాజధాని అనుకోవాలని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎక్కడ్నుంచి పనిచేస్తే అదే రాజధాని అవుతుందని, అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు అని చెప్పారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే.. సెక్రటేరియెట్, అదే రాజధాని అని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దానికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు.