నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. సీఎం క్యాంప్ ఆఫీస్కు మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చేరుకున్నారు.ఇప్పటికే సీఎం దగ్గరకు మాజీ మంత్రి అనిల్ యాదవ్ వచ్చారు. అంతకుముందు మంత్రి కాకాణి, ఆనం వేంరెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అనిల్కు సీఎం జగన్ నుంచి పిలుపువచ్చింది. దీంతో బుధవారం సాయంత్రం 3గంటలకు సీఎం జగన్ను అనిల్ కుమార్ యాదవ్ కలిశారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్న అనిల్, కాకాణిలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.