: లక్ష్మీపార్వతి
తెలుగు సరిగా రానివాళ్లు కూడా తెలుగు గురించి మాట్లాడటం హాస్యాస్పదమని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. టీడీపీ అండ్ కో ఇకనైనా అర్ధం పర్థం లేని పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ చొరవతో తెలుగు భాషకు ఇప్పుడు సరైన పునాది పడుతోందన్నారు. తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయ పునరుద్ధరణ జరగబోతోందని, ఏపీలో తెలుగు భాషకు నిజమైన పట్టం కట్టబోతున్నామని అన్నారు.