యుద్ధం బారిన పడిన ఉక్రెయిన్ విద్యార్ధుల విద్యాభ్యాసానికి పూర్తి భరోసా ఇవ్వాలంటూ సీఎం జగన్కు టీడీపీ నాయకుడు నారా లోకేష్ లేఖ రాశారు. విద్యార్ధులు తమ విద్యను పూర్తిచేసేందుకు ఏపీ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడు, తెలంగాణ మాదిరిగా ఉక్రెయిన్ విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. విద్యార్థుల చదువుల బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు.