సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఏపీ సీఎం జగన్తో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయినట్లుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ భేటీపై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఫైనల్గా మాత్రం జగన్కి అనుకూలంగా వర్మ ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నాడని, అందు నిమిత్తమే ఆయనతో భేటీ అనేలా విషయం బయటికి వచ్చింది. ఈ విషయంపై తాజాగా వర్మ కూడా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్’’ అంటూ వరుస ట్వీట్స్తో నిన్న భేటీకి సంబంధించిన వివరాలను వర్మ బయటపెట్టాడు.