కాకాణితో విభేదాలపై వివరణ
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల కాకాణి గోవర్థన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన ఆయన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.మరోవైపు కాకాణ మంత్రి అయ్యాక తొలిసారి నెల్లూరు వస్తున్న సందర్భంగా ఇటీవల నిర్వహించిన ర్యాలీకి పోటీగా మాజీ మంత్రి అనిల్ ఆత్మీయసభను పెట్టడం వంటివి పార్టీలో అంతర్గతంగా చర్చనీయంశమైంది. ఈ నేపథ్యంలో కాకాణి, అనిల్లకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. తాడేపల్లికి రావాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అనిల్ కాసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సింగిల్గానే వచ్చిన అనిల్ నేరుగా జగన్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కాకాణితో తనకున్న విభేదాలపై జగన్కు ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం.