ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని ఒలింపిక్స్ కాంస్య విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు శుక్రవారం కలిశారు. ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సింధును ఆయన సత్కరించారు.విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అధికారులు అందించారు.